CM Revanth Reddy MLC Champaign : 11 ఏళ్ల ప్రధాని మోదీ పాలనలో రాష్ట్రానికి ఏం చేశారని, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 2014, 2019 ఎన్నికల ప్రచారంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 2 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, ఒకటి కిషన్రెడ్డికి మరొకటి బండి సంజయ్కు అని ఎద్దేవా చేశారు. వీరికి కాకుండా ఇంకెవరికైనా ఇచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల, కరీంనగర్లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
Category
🗞
News